Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

రామాయణం .1

రామాయణం .1..
       (ప్రారంభం)

రామాయణం!!
ఆ పేరు చెవిన పడగానే అంతులేని శక్తి ఎక్కడినుండో వస్తుంది...... ..
.
మహర్షి వాల్మీకి వ్రాసిన ఒక ఉత్తమోత్తమ మానవుడిజీవనయానం ,..
.ఒక ఉదాత్తమయినచరిత్ర....
.
పితృవాక్యపాలనం... ,సోదరప్రేమ... ,ఏకపత్నీవ్రతం... ,ప్రజారంజక పరిపాలన... ,స్నేహధర్మం....,సేవానిరతి....,రాజనీతి...,
 ఇలా ఒక్కొక్క విషయము గూర్చి వింటుంటే అవి మన గుండె లోతుల్లో ఎక్కడో తడుతూ ఉంటాయి .......
.
 రామాయణం హృదయ సంబంధి...అంటే రామాయణం చదువుతున్నప్పుడు మన హృదయంలో ఎదో ఒక మూల తెలియని కదలికలు వస్తుంటాయి.
.
అదే మహా భారతం చదివినట్లయితే మన మేదోవికాసానికి కావలసిన సామాగ్రి అంతా దొరుకుతుంది

 ...yes ! RAAMAAYAN TOUCHES OUR SOUL ,
MAHABHAARATHA TOUCHES OUR MIND!!
.
ప్రతినాయకుడి పక్షంనుండి నాయకుడి ప్రశంస ఏ వాజ్మయంలో ఉంది ?.......

రామో విగ్రహవాన్ ధర్మః  ......
.
అంటే  ధర్మాన్ని కనుక కరగించి మూస పోస్తే అది తాల్చే ఆకారం “శ్రీ రాముడు “
.
ఈ మాటలు మారీచుడు రావణాసురుడితో అంటాడు !
.
శ్రీ రాముడి గుణగణాలగురించి మనకు అయోధ్యాకాండలో కనపడుతుంది ......
.
బుద్ధిమాన్ ,మధురాభాషీ,పూర్వభాషీ ,ప్రియంవదః
వీర్యవాన్ న చ వీర్యేణ మహాతాస్వేన విస్మితః
.
ప్రశస్తమైన బుద్ది గలవాడు ,మధురముగా అంటే తియ్యగా మాట్లాడేవాడు ,
చక్రవర్తి తనయుడు, మహాధానుష్కుడు, సంపద లోను
శౌర్యం లోను తనతో తులతూగ గలిగే వాడు లేడు...
అయినా  కించిత్ గర్వం లేకుండా తానే అందరినీముందుగాపలుకరిస్తాడు ,
శత్రువుల విషయంలో గూడా ప్రియవచనాలేపలుకుతాడు .....
.
రాముని గుణాలు ఇవి అని ఏమి చెప్పగలం? సకల సుగుణాభిరాముడు! సర్వలోక మనోహరుడు,
 లోకంలోని సద్గుణాలన్నీ ఒక చోట చేరి రూపం దాలిస్తే ఆ రూపమే శ్రీ రాముడు .
.
 ఏ విధమైన ఆలోచన లేకుండా మనం నిత్యం ఎన్నో తప్పులు చేస్తుంటాం ,ఒక జీవనకాలంలో లెక్క వేస్తే వాటి సంఖ్య వేలల్లో ఉంటుంది . 
.
అదే మన పిల్లలకు రామాయణ పారాయణం అలవాటు చేసి రామకధచెప్పవలసినవిధంగాచెపితే .....
.
రామకధాసుధారససారం రంగరించి వారి ఉగ్గుపాలలో పోసి పెంచితే!
.
జీవన గమనంలో వచ్చే ఆటు పోట్లు ఎదుర్కొనే శక్తీ లభించడమే గాకుండా, జీవితంలో తప్పులు, పొరపాట్లు    దొర్లినప్పుడు దిద్దుకునే ధీశక్తి లభిస్తుంది. ......
.
Sir William Jones  అనే ఒక బ్రిటిష్ విద్యావేత్త 18వ శతాబ్దంలోనే  ఈవిధంగా అంటాడు.
.
” భారత దేశం నుండి ఆంగ్లేయులు తెచ్చుకోవలసిన నిజమైన సంపద రామాయణమే !
ఎందుకంటే మనిషి మనిషి గా జీవించే సరళమైన హృద్యమైన విధానం నేర్పుతుంది గనుక! “
.
 వందే వాల్మీకి కొకిలం !!!!
.

.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కరోనాకు భయపడకండి...

కరోనాకు భయపడకండి... 
ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి.. ఇది పూర్తిగా చదవండి కరోనా చికిత్స పై ఒక ప్రాథమిక అవగాహన కోసం ఈ పోస్ట్.

కరోనా వ్యాధికి చికిత్సపై.. సీనియర్ జర్నలిస్టు రమణకుమార్ గారి స్వీయ అనుభవం.. 

Dear friends: 
  
కరోనాకు భయపడకండి.      
   
కరోనా వచ్చింది అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి వస్తుంది. కరోనా వచ్చిన వారు first ధైర్యంగా ఉండాలి. 

నేను వృత్తి రీత్యా జర్నలిస్టును. 24 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్నాను.  నా వృత్తి ధర్మంలో భాగంగా నేను విధులు నిర్వహించడానికి వెళ్ళినప్పుడు మరో మీడియా మిత్రుని  ద్వారా నాకు కరోనా సోకింది. నాకు positive వచ్చింది అని తెలియగానే ముందు నేను కొంత ఆందోళన పడ్డాను. వెంటనే మా కుటుంబ సభ్యులకు టెస్ట్ చేయించడంతో వారికి కూడా positive అని తేలింది. 

ఆందోళన నుంచి తేరుకొని నా మిత్రులు, శ్రేయోభిలాషులు సూచన మేరకు వెంటనే మా కుటుంబ సభ్యులు అందరం నేచర్ క్యూర్ హాస్పిటల్ లో చేరాము. హాస్పిటల్‌లో వైద్యులు ఇచ్చిన మెడిసిన్స్, అక్కడి వాతావరణం మమ్మల్ని వారం రోజుల్లోనే సాధారణ వ్యక్తులుగా మార్చింది. 

మాకు ఇచ్చిన మెడిసిన్స్ 
* ప్యారసిటమాల్-500mg టాబ్లెట్స్, 
* B-Complex, 
* C Vitamin Tablets, 
* Citrizen Tab, 
* Ambroxel syrup (దగ్గు ఉన్న వారికి మాత్రమే.) 

నాకు కానీ, నా మిస్సెస్ కు కానీ పెద్దగా సింటెమ్స్ ఏమి లేవు. టెస్ట్ positive వచ్చిన తర్వాత రెండవ రోజు నుంచి మా ఇద్దరికీ కొంచం పొడి దగ్గు ప్రారంభం అయింది. జ్వరం ఉండేది కాదు కానీ, బాడీ feverish గా ఉండేది. డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు paracitamal ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాము. పొడి దగ్గు ఉంది కాబట్టి దగ్గు సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాము. రోజుకు ఒకటి B- complex tablet, ఒకటి C-Vitamin tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు వేసుకున్నాము. 

ఈ మెడిసిన్ తో పాటు మేము పాటించిన నియమాలు ఏమిటి అంటే. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని garlic చేయడం (ఉక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం. 

''వీటన్నిటినీ మేము వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడంతో వారం రోజుల్లోనే మేము సాధారణం స్ధితికి వచ్చేశాము." 

వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, orenge వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు. కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారు, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే  ఇక్కడికి వచ్చిన వారు నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో ఉదయం, సాయంత్రం ఇచ్చే హెర్బల్ టీ లో వేసే పొడి..."మిరియాలు, దాచిన్ చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన powder ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ సాయంత్రం ఒక టి చాలు

కరోనా వచ్చింది అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఎదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం మానేయండి

కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో  గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుంది డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వరెంటైన్ కానీ, హాస్పిటల్ క్వరెంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం  మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్న ప్రాక్టికల్ అనుభవం ఇది.


ఇది పూర్తిగా చదివిన వారు మన మిత్రులకు పంపించడం మరువకండి.

బ్యాంకుల్లోకి రద్దీ అవసరం లేదు

         

బ్యాంకుల్లోకి రద్దీ అవసరం లేదు
మీ మొబైల్ నుండి మిస్డ్ కాల్ చేసి, బ్యాలెన్స్ తనిఖీ చేయండి


లాక్డౌన్ తరువాత, వివిధ పథకాల కింద కార్మికులు, రైతులు, మహిలా జన ధన్ ఖాతాదారులకు డిబిటి ద్వారా డబ్బు పంపబడుతోంది. ఆశ్చర్యకరంగా, ఈ మొత్తం గురించి తెలుసుకోవడానికి ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి వారి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు ...

బ్యాంక్ పేరు బ్యాలెన్స్ తెలుసుకోవడానికి జారీ చేసిన సంఖ్య ..........
 
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9555244442
కెనరా బ్యాంక్ 09015483483, 09015734734
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223766666, 1800112211
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 18001802222, 18001802223, 01202303090
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9222281818
యాక్సిస్ బ్యాక్ 18004195959
పంజాబ్ & సింధ్ బ్యాంక్ 7039035156
యుకో బ్యాంక్ 9278792787
దేనా బ్యాంక్ 09278656677, 09289356677
బ్యాంక్ ఆఫ్ ఇండియా 9015135135
ఐసిఐసిఐ 9594612612
ఇండియన్ బ్యాంక్ 9289592895
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 08067205757
హెచ్‌డిఎఫ్‌సి 18002703333, 18002703355
కార్పొరేషన్ బ్యాంక్ 9268892688
ఐడిబిఐ 18008431122
అవును బ్యాంక్ 9223920000
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223008586
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09015431345
బ్యాంక్ ఆఫ్ బరోడా 8468001111
అలహాబాద్ బ్యాంక్ 9224150150.




Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...